Saturday, January 30, 2016

సాహితి ప్రపంచానికీ విషాద వార్త       
     ప్రముఖ సాహితీవేత్త నాయిని కృష్ణకుమారి కన్నుమూత
హైదరాబాద్‌: ప్రముఖ సాహితీవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వీసీ నాయిని కృష్ణకుమారి కన్నుమూశారు. తెలుగు జానపద సాహిత్యంలో కృష్ణకుమారి విశేష కృషి చేశారు. నాయిని కృష్ణకుమారి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తెలుగు సాహితీ వికాసానికి నాయిని కృష్ణకుమారి ఎనలేని సేవలందించారని కొనియాడారు. తెలుగు సంస్కృతిపై ఆమె ఎన్నో పరిశోధనలు చేశారని, గొప్ప సాహితీ విమర్శకురాలని కొనియాడారు.